Weather Updates | హైదరాబాద్: చలికాలం ఇంకా అయిపోనేలేదు.. అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేసవి తరహాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల కూడా రాకముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎప్పుడైనా ఫిబ్రవరిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల వరకు నమోదయ్యేవి.. కానీ ఈసారి 34 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి. గురువారం ముషీరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, గోల్కొండ 34 డిగ్రీలు, ఖైరతాబాద్ 35.1 డిగ్రీలు, ఆసిఫ్నగర్ 34.6 డిగ్రీలు, షేక్పేట 34.8 డిగ్రీలు, మెండా మార్కెట్ 34.5 డిగ్రీలు, చార్మినార్ 34.7 డిగ్రీలు, అమీర్పేట 35 డిగ్రీలుగా నమోదయ్యాయి.మరో రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల సెల్సియస్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఫిబ్రవరి మధ్యలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఫిబ్రవరి నెల మధ్యలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి వెల్లడించారు. రాబోయే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని.. సగటున 31-33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. పగటిపూట ఎండలు మండినప్పటికీ రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.