హైదరాబాద్, జనవరి 3, నమస్తే తెలంగాణ : ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్లో 55 ఎకరాలు, శామీర్ పేట మండలం జవహర్నగర్లో 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో 509 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఓఎం దేబర మరొకరు 2010లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్త్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ అనిల్ కుమార్ల ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘ సభ్యుల ఇండ్ల స్థలాల నిమిత్తం భూమిని కేటాయించడాన్ని ధర్మాసనం సమర్థించింది.