హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లింపు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని తెలిపారు. దీనిపై వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. అంబర్పేటలో దాడి చేసిన మూడు కుకలను అధికారులు స్టెరిలైజ్ చేసి విడిచిపెట్టారని తెలిపారు. అంబర్పేటలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడిపై కుకలు దాడి చేసిన ఘటన తీవ్ర బాధ కలిగించిందని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. నాలుగేండ్ల బాలుడిపై కుకల దాడి గురించి పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గురువారం విచారణ జరిపింది. కుకలు వీధుల్లో సంచరించకుండా వాటి కోసం నివాస కేంద్రాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలను వివరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. కుకలకు ప్రత్యేక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వీధుల్లో కుకలు వీరవిహారం చేయబోవని పేర్కొన్నది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను ఆదేశించింది. విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.