హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కు హైకోర్టులో ఊరట లభించింది. గంగుల ఎన్నిక చెల్లదని పేరొంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ పొన్నం చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేదని కోర్టు పేర్కొంది. 2018లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గంగుల కమలాకర్ పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారనే అభియోగాలతో పొన్నం ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత బుధవారం తీర్పు వెల్లడించారు. గంగులపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను పొన్నం చూపలేదని, కాబట్టి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామని తీర్పులో పేరొన్నారు. ఇదిలాఉండగా, గంగుల ఎన్నికను సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ దాఖలు చేసిన మరో ఎన్నికల పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరుపనుంది.