హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తె లంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకో ర్టు నిరాకరించింది.
ప్రభుత్వం ఇచ్చిన భూమి లో నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ వాదన విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది.