హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీలకు పాయింట్లను లెకించే ముందు పాఠశాలలో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేసింది. సీనియార్టీ జాబితా లేకుండా రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వెంకటరమేశ్ మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలు గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 81కి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. పిటిషనర్లు 2012 నోటిఫికేషన్ ఆధారంగా 2013, 2014 సంవత్సరాల్లో నియమితులయ్యారని, అధికారుల పాలనాపరమైన వివాదాల వల్ల కొందరు 16 నెలలు ఆలస్యంగా నియమితులయ్యారని చెప్పారు. సీనియార్టీ జాబితా రూపొందించే ముందు తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను వేరుగా చూడరాదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యాశాఖ కింద పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కమి టీ బదిలీ మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పారు. ఇవి జీవో 81కి విరుద్ధం కాదని, దానికి అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు. పిటిషనర్లు అందరూ పదేండ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారని, అందరూ బదిలీకి అర్హులేనని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఒకే నోటిఫికేషన్ ఆధారంగా నియమితులైనందున వారు చేరిన తేదీలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమాలతో నిమిత్తం లేకుం డా సీనియార్టీ జాబితా రూపొందించి, బదిలీ పాయింట్లను కేటాయించి బదిలీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేశారు.