జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హైకోర్టు జడ్జి(High Court Judge) ఎన్. రాజేశ్వరరావు(Rajeswara Rao) పర్యటిస్తున్నారు. కాళేశ్వరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహదేవపూర్లో(Mahadevpur) సబ్ కోర్టు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలాగే భూపాల పల్లి ఏరియాలోని కృష్ణ కాలనీలో జిల్లా కోర్టుకు కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని కూడా న్యాయమూర్తి పరిశీలించారు. అక్కడి నుంచి సబ్ కోర్టుకు చేరుకొని కార్యాలయాలను పరిశీలించారు. జిల్లా కోర్టులో మొక్కలు నాటి ఇ- కోర్టు సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత ములుగు, భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులతో, న్యాయవాదులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు.