హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినందున కోర్టు ధికరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ను (Ranganath) హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని బతుకమ్మకుంట పరిధిలో ఓ ప్రైవేటు స్థల వివాదంపై యథాతథస్థితి కొనసాగించాలన్న తమ ఆదేశాలను ధికరించిన కేసులో నోటీసులు జారీచేసింది. నవంబర్ 27న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగానూ మార్పులు చేయరాదని జూన్ 12న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై కోర్టు ధికరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏ సుధాకర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదనరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
పిటిషనర్ సమర్పించిన ఫొటోలను పరిశీలిస్తే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన జూన్ 12నుంచి అక్టోబర్ 5వరకు పనులు చేపట్టి, ఆ స్థలం రూపురేఖలు మార్చినట్టు తెలుస్తున్నదని తెలిపింది. బతుకమ్మకుంటను హైడ్రా అభివృద్ధి చేసినట్టు అక్టోబర్ 5న నెలకొల్పిన శిలాఫలకం స్పష్టం చేస్తున్నదని తెలిపింది. బతుకమ్మకుంటను ప్రైవేటు ఏజెన్సీలు విమోస్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ చేయగా, ఎన్పీఆర్ ఇన్ఫ్రాటెక్ నిర్మాణం చేపట్టినట్టు ఉన్నదని పేర్కొంది. కోర్టు ధికరణకు పాల్పడినవారి వ్యక్తిగత హాజరుకు సంబంధించి ఇదే హైకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుత కేసులో వాస్తవాలను పరిశీలించిన తర్వాత మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కోర్టు ధి కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నో టీసుజారీ చేసి.. విచారణను 27కు వాయిదా వేసింది.