High Court | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. నాగోలుకు చెందిన హరీందర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఇందులో ప్రజా ప్రయోజనమేమి లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్గా మార్చాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తీవ్ర రద్దీ పెరిగిందని పిటిషన్ వాదించారు.
కుటుంబంతో వెళ్తే బస్సుల్లో నిలబడే పరిస్థితి కూడా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉచిత ప్రయాణంపై ఇచ్చిన జీవో 47ని రద్దు చేయాలని హరీందర్ హైకోర్టును కోరారు. అయితే, పిటిషన్ ఉచిత ప్రయాణంతో ఇబ్బందులను ఎదుర్కొని పిల్ను దాఖలు చేశారని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబర్లో జీవో జారీ చేసింది. ఉచిత ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్ సర్కారు జారీ చేసిన జీవోను నాగోల్కు చెందిన హరిందర్ పిటిషన్ వేశారు. అయితే, ఆర్టీసీలో వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదన్నారు. ఉచిత ప్రయాణంతో ఆర్థికంగా ఆర్టీసీ మీద పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించడం అన్యాయమని పిటిషన్లో పేర్కొన్నారు. పన్నుల రూపంలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే నిలిపివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టు కోరారు. పిటిషనర్ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.