హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తి జస్టిస్ ఏ అభిషేక్రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన వీడోలు సమావేశం నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ అయినందున న్యాయమూర్తులంతా (ఫుల్కోర్టు) సమావేశమై వీడ్కోలు పలికారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్తో సహా పలువురు వక్తలు ఆయన సేవలు, కీలక తీర్పులను గుర్తు చేశారు. అనంతరం అభిషేక్రెడ్డి దంపతులను సీజే దంపతులు సన్మానించారు. హైకోర్టు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్రావు అధ్యక్షతన అసోసియేషన్ సతరించింది. సుమారు ఐదు నెలల క్రితం ముగ్గురు న్యాయమూర్తులను వేరే రాష్ర్టాలకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ నాగార్జున ఇటీవల మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు అభిషేక్ రెడ్డి పాట్నాకు వెళ్తున్నారు. ఏపీ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సులకు ఇప్పటివరకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. తాజా బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సీజేతో కలిపి 29కి తగ్గింది.