హైదరాబాద్, ఫిబ్రవరి 26 : హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత్రెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శిగా బీ రామసురారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా ఏవీఎస్ మురళీ కామేశ్వర్, వీ రేణుక, కోశాధికారిగా జీ వెంకటేశ్, 17 మంది కార్యనిర్వాహక సభ్యులు ఎన్నికయ్యారు.