యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకొన్నారు.
అనంతరం గర్భాలయ ముఖ మండపంలో అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణారావు స్వామివారి ప్రసాదం అందజేశారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి కే సురేందర్ కూడా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.