హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): న్యాయ ప్రపంచంలో అహంకారానికి తావు లేదని, ప్రతి కేసును కొత్తగా చూడాలని, ప్రతి తీర్పును కొత్తగా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. న్యాయం ఆశించే కక్షిదారుడు కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని కోరుకొంటాడని, ఈ మేరకు కాలపరిమితిని నిర్ణయించే యంత్రాంగాన్ని న్యాయవ్యవస్థ అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించిన జస్టిస్ భూయాన్కు గురువారం హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన కేసు ఎప్పటిలోగా పరిషారం అవుతుందోననే కక్షిదారుడి ప్రశ్నకు న్యాయ వ్యవస్థ తగిన పరిషారం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 95 శాతానికిపైగా కక్షిదారులు ఎంతో ఆందోళనతో, న్యాయం లభించాలని కోర్టులను ఆశ్రయిస్తారని, వారి విషయంలో గౌరవంగా మెలిగి, వాజ్యాలకు పరిషారం చూపే దిశగా న్యాయమూర్తులు పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలతో అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని చెప్పారు. జస్టిస్ భూయాన్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా విధులు నిర్వహించారని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. హైకోర్టు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిగా జస్టిస్ భూయాన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.