హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ను తిరసరించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక తాము ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ.. పిటిషన్పై విచారణ ముగించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూర్ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ విజయుడు ఆ పదవికి రాజీనామా చేయకుండానే అలంపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని, దానిని తిరసరించేలా రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.