శంషాబాద్ రూరల్, మే 4: శంషాబాద్ ఎయిర్పోర్టులో టాంజానియా దేశస్థుడి నుంచి భారీ ఎత్తున హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న అతడు జొహాన్నెస్ బర్గ్ నుంచి దుబా య్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు.
అనుమానం వచ్చిన అధికారులు అతనిని ఆదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతడి కడుపులోంచి హెరాయిన్ నింపి ఉన్న108 క్యాప్సుల్ (1389 గ్రాములు) బయటికి తీశారు. దీని మా ర్కెట్ విలువ రూ.11.53 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.