మానవత్వం చాటుకొన్న బోయినపల్లి వినోద్కుమార్
మల్యాల, జూన్ 6: రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెంటనే వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వాన్ని చాటుకొన్నారు. ఆదివారం వినోద్కుమార్ జగిత్యాల జిల్లా మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కరీంనగర్ వైపు వెళ్తున్నారు. మల్యాల ఎక్స్రోడ్ వద్దకు రాగానే అక్కడ గాయాలతో పడిపోయి ఉన్న ఎర్రం హరిచరణ్ను చూసి వాహనాన్ని ఆపారు. గాయపడిన వ్యక్తిని పరిశీలించి పోలీసులకు, 108కు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. ఆ వెంటనే జగిత్యాల దవాఖానకు తరలించారు.