శాయంపేట, జూన్ 20: ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు మృతిచెందితే రోజులతరబడి బాధపడుతూనే ఉంటారు. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు. కానీ, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టుసింగారానికి చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ కొడుకు పెద్దకర్మ నాడు హెల్మెట్లు పంపిణీ చేశారు. కూకిడి సత్యనారాయణ (చంటి) 10 రోజుల క్రితం బైక్పై వెళ్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చేతికొచ్చిన కొడుకు మృతి ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది.
హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కేవని.. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని చిన్న పాటి నిర్లక్ష్యం దూరం చేసిందని ఆ తల్లిదండ్రులు బాధపడ్డారు. తమ కొడుకులా ఇంకెవరూ ప్రాణాలు కోల్పోవద్దని భావించి సోమవారం అతడి పెద్దకర్మ సందర్భంగా 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒకరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్ర తా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.