హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అరకులో శనివారం టీడీపీ నిర్వహించిన ‘రా కదలిరా’ సభకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది పైలట్కు సూచనలు చేయడంతో హెలికాప్టర్ను వెనక్కి తీసుకొచ్చి సరైన మార్గంలో తీసుకొచ్చారు. సభకు వెళ్లేందుకు చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ను అప్రమత్తం చేసింది.ఆ తరువాత నిర్దేశించిన మార్గంలో అరకు బయలుదేరిన హెలికాప్టర్.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.