సిద్దిపేట : హైదరాబాద్-నాగ్పూర్(Hyderabad-Nagpur) జాతీయ రహదారి(National highway)పై భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) అయింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని నిన్న ఓ గ్రామంలోని యువతిని కక్షపూరితంగా కారుతో గుద్దించి చంపేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇదే ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా, యువతి మృతికి కారణమైన వారిని శిక్షించాలని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో రోడ్డుపైన భారీగా వాహనాలు నిలిచిపోయాయి.