హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
గురువారం పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని, పలుప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని టీఎస్ డీపీఎస్ వివరించింది.