Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ను ప్రకటించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిలాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ను ప్రకటించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొందీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.