హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. భారీగా వరద పోటెత్తడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 9 గేట్లు, కౌలాస్నాలా ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేశారు. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. భారీగా వరద వస్తుండటంతో అధికారులు నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1402 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. సాగర్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
జగిత్యాల జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. అనంతరం జాతీయరహదారిపై వరద పారుతున్నది. దీంతో ధర్మపురి-జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు అర్పనపల్లి వంతెనపై వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కేసముద్రం-గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు పొంగిపొర్లుతుండటంతో దంతాలపల్లి-పెద్దముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో ఓ స్కూలు బస్సు వరదలో చిక్కుకుపోయింది. దీంతో గ్రామస్థులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు. నరసింహులపేటలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ములుగు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వానలకు ముత్తారం వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ఒక్కసారిగా పొంగడంతో గ్రామస్థులు వరదలో చిక్కుకుపోయారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతో గ్రామస్తులు క్షేమంగా బయటపడ్డారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. హనుమకొండ-సిద్దిపేట లోలెవల్ బ్రిడ్జిపైనుంచి వాగు పారుతున్నది. దీంతో బస్వాపూర్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి.. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోరెడ్డిపల్లి మీదుగా హుస్నాబాద్ వైపు వాహనాలను దారిమళ్లించారు. మిర్దొడ్డి మండలం అల్వాల్లో కూడవలి వాగు జోరుగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతికి ఓ యువకుడు గల్లంతయ్యాడు. గున్నలవాగు ఉధృతికి హవేలీఘనపూర్-తిమ్మాయిపల్లిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భా%