హైదరాబాద్: తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.
కాగా, హైదరాబాద్తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో తెల్లవారుజామున ప్రారంభమైన వాన గంటపాటు దంచికొట్టింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సీతాఫల్మండిలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక బన్సీలాల్పేటలో 6.7 సెంటీమీటరలు, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీనగర్లో 5.8, బాలానగర్లో 5.4, ఏఎస్రావ్ నగర్లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్గిరిలో 4.7, ఫలక్నుమాలో 4.6, గన్ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్లో 4.3, చార్మినార్లో 4.2, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1, అంబర్పేటలో 4, అమీర్పేట, సంతోష్నగర్లో 3.7, ఖైరతాబాద్లో 3.6, బేగంబజార్, హయత్నగర్, చిలుకానగర్లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ నిలిపివేశారు. కాగా, ఒక్కసారిగా వాన కురియడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.