Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్లో 13 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మద్గుల్ చిట్టెంపల్లిలో 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సర్పన్పల్లి ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. తాండూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఎనిమిది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లా బాసరలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో వర్షాలకు నీరంతా నిలిచిపోయింది. గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. మహబూబాబాద్ అర్పనపల్లి వద్ద వట్టివాగు పొంగి ప్రవహిస్తున్నది. కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
#Waterlogging in Mallepally area due to #HeavyRains in #Hyderabad.
Corporator Zafar Khan at work with @GHMCOnline team, trying to clear the WaterLogging in #Mallepally area.#HyderabadRains #HeavyRain#Telanganarains pic.twitter.com/CvOmweHJc7— Surya Reddy (@jsuryareddy) July 26, 2022
సరూర్నగర్, కోదండరాంనగర్ లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. సూరారం తెలుగుతల్లి నగర్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. నగర పరిధిలోని శేరిలింగంపల్లిలో 7.4, మెహదీపట్నంలో 6.7, నాంపల్లిలో 8, నారాయణగూడలో 8.5, చార్మినార్లో 8.5, ఎల్బీనగర్ సంతోష్నగర్లో 7.7, సరూర్నగర్ 6.4 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
#HeavyRains at many parts of old city in #Hyderabad today.#HeavyRain #HyderabadRains pic.twitter.com/Ywx7HW4sYc
— Surya Reddy (@jsuryareddy) July 26, 2022
వర్షానికి హుస్సేన్సాగర్ వరద పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోయింది. ప్రస్తుతం నీటిమట్టం 513.45 మీటర్లు ఉన్నది. పూర్తిస్థాయినీటిమట్టం 513.41 మీటర్లు. మరో వైపు జంట జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతున్నది. ఉస్మాన్సాగర్ నుంచి మూసీలోకి 1,278 క్యూసెక్కుల వరదను అధికారులు విడుదల చేశారు.
ఉస్మాన్సాగర్కు ఇన్ఫ్లో 1200 క్యూసెక్కుల ఉండగా.. ప్రస్తుతం నీటిమట్టం 1778 అడుగులున్నది. హిమాయత్సాగర్ జలాశయానికి ఇన్ఫ్లో 325 క్యూసెక్కులు ఉండగా.. మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1,760.70 అడుగుల నీరున్నది.
Mallepally area of #Hyderabad at night due to heavy #Rains pic.twitter.com/zArxpOaIMc
— Sandeep Dhar (@sandeepdhar10) July 26, 2022