హైదరాబాద్ : హైదరాబాద్: భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలోని(Telangana) పలుచోట్ల వర్షం(Heavy rain) కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో(Stormy winds) కూడిన వర్షం పడింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండలో వర్షం కురిసింది.
కాగా, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వడగండ్ల వాన(Hail rain) కురిసింది. అలాగే కామారెడ్డి (Kamareddy) జిల్లాలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు గుట్టకింది తండాలో ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వర్షాలతో కొంత ఊరట పొందారు.