హైదరాబాద్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి సుమారు 5.8కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
ఈనెలలో నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం అకడకడ మోస్తరు వర్షాలు, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో హనుమకొండ, వరంగల్, జనగామ, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మలాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్లో పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. రాత్రి వర్షాలు పడే అవకాశం ఉన్నదని వివరించింది.