హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో 20.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
దంతాలపల్లి(మహబూబాబాద్) – 20.3 సెం.మీ.
దేవరపుప్పుల మండలం(జనగామ) – 18 సెం.మీ.
నెల్లికుదురు మండలం(మహబూబాబాద్) – 14.8 సెం.మీ.
కొమ్ములవంచ(మహబూబాబాద్) – 14.3 సెం.మీ.
పెద్దనాగారం(మహబూబాబాద్) – 14 సెం.మీ.
ముకుందాపురం(సూర్యాపేట) – 13.6 సెం.మీ.
తొర్రూర్ మండలం(మహబూబాబాద్) – 12.5 సెం.మీ.
పమ్మీ(ఖమ్మం) – 11.8 సెం.మీ.
నాగులవంచ(ఖమ్మం) – 11.6 సెం.మీ.
ఆత్మకూర్(సూర్యాపేట) – 11.6 సెం.మీ.
ఉర్లుగుండ(సూర్యాపేట) – 11.5 సెం.మీ.
గుండాల మండలం(యాదాద్రి) – 11.4 సెం.మీ.
మేళ్లచెరువు(సూర్యాపేట) – 11.2 సెం.మీ.
మామిళ్లగూడెం(సూర్యాపేట) – 11 సెం.మీ.
నడిగూడెం(సూర్యాపేట) – 10 సెం.మీ.
మరిపెడ మండలం(సూర్యాపేట) – 10 సెం.మీ.