సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : ఎర్లీబర్డ్ పథకంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందే అవకాశాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 61 రోజుల పాటు అవకాశం కల్పించినా.. భవన యజమానులు అనాసక్తి కనబర్చారు. వాస్తవంగా ఈ పథకం గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం గడువును మే 31 వరకు ప్రభుత్వం పెంచింది. అయితే ఈ రెండు నెలల సమయంలో కేవలం ఐదు లక్షల మంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. ఆరు జోన్ల పరిధిలో రూ. 400కోట్ల నిర్దేశిత లక్ష్యానికి రూ.140.55కోట్లు మాత్రమే బల్దియా సమకూర్చుకోగలిగింది.