శంషాబాద్ రూరల్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆదివారం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా ముగ్గురు ప్రయాణికుల నుంచి 3.743 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చారు.
వీరిలో ఒకరి వద్దనుంచి రూ.36,41,142 విలువ చేసే 594 గ్రాముల బంగా రం, మరో ప్రయాణికుడి నుంచి రూ.75,14,150 విలువ చేసే 1,225 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మూడో ప్రయాణికుడి నుంచి రూ. 1.18 కోట్ల విలువ చేసే 1,924 గ్రాముల బంగారాన్ని (పేస్ట్ రూపంలో) స్వాధీనం చేసుకున్నారు.