సూర్యాపేట: మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,597.36 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 641.80 అడుగుల నీటిమట్టం ఉన్నది. జలాశయం పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలకు గాను… పూర్తిస్థాయి 3.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,063 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 450 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా, 530.10 అడుగుల నీటిమట్టం ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 168.3418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.