హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు లాయర్ల అభ్యర్థనతో రాష్ట్ర హైకోర్టు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను కూడా ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు పూర్తికాగా.. పిటిషనర్ తరఫున మౌకిక వాదనలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లకు జడ్జి సూచించారు. ఈ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.