సంగారెడ్డి, జూన్ 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటాన్చెరులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలు, బీఆర్ఎస్ ప్రజ్రాప్రతినిధులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కొల్లూరులో దక్షిణాసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల టౌన్షిప్ను ప్రారంభించనున్నారని, పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేస్తారని, వెలిమల శివారులో మేధా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం పటాన్చెరు పట్టణం ముస్తాబైంది.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రాకకోసం భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.