మేడ్చల్ మల్కాజిగిరి : బస్తీ దవఖానలతో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోని ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవఖానను గురువారం మంత్రి ప్రారంభం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..బస్తీ ప్రజలందరికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకకావాలనే సంకల్పతో సీఎం కేసీఆర్ బస్తీ దవఖానలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని అన్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ బస్తీ దవఖానల సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
వీటిలో అర్హత గల వైద్యులు, సిబ్బంది, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని వివరించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి బస్తీ దవఖానలో షుగర్,బి.పి పరిక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాధాకృష్ణ, ఎం.జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు