మామిళ్లగూడెం, జనవరి 29: ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.50 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మం నగరానికి చెందిన బూర్ల రామారావుకు ఇద్దరు కుమారులు విజయ్, విష్ణు, కుమార్తె నాగజ్యోతి ఉన్నారు. తండ్రీకూతురు మధ్య కొన్నేండ్ల నుంచి ఆస్తి తాగాదాలు ఉన్నాయి. తండ్రితోపాటు ఇద్దరు సోదరులు తనను ఆర్థికంగా మోసం చేశారని రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిలు కోసం రామారావు, అతని కుమారులు విష్ణు, విజయ్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు వారికి 41ఏ సీఆర్పీసీ నోటీసు అందించేందుకు రైటర్, హెడ్కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్స్టేషన్లో రామారావు కుటుం బం నుంచి హెడ్కానిస్టేబుల్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడు కోటేశ్వరరావుపై సీపీ సునీల్దత్ ఒకటి రెండు రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాగా.. కోటేశ్వరరావు అవినీతిపై గతంలోనూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని, ఎస్హెచ్వోలు ఆయనను ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోవడం లేదని సమాచారం.