హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక్రాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్య హత్య చేసిన తర్వాత అశోక్రాజ్ కొడుకుతో హైదరాబాద్లోని ఏఎస్రావునగర్లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి విక్టోరియా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వారం క్రితం ఆస్ట్రేలియా విక్టోరియా బక్లీలో రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మృతదేహాన్ని అతడు దాచిపెట్టాడు.
చైతన్య చెల్లెలు రాచకొండ కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించింది. హత్యకు గురైన చైతన్య ఏఎస్రావునగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్శెట్టి గౌడ్, మాధవి కుమార్తె. చైతన్య, అశోక్ రాజ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. ఉపాధి నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న అశోక్.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తరుచూ భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తున్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు.