నిర్మల్, డిసెంబర్ 29 : యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖతాల్లో నగదు జమ అవుతుండటంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ..అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.