నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 16 గుంటల భూమిలో వివిధ ఆకృతుల్లో వరి సాగు చేయగా వ్యవసాయ అధికారులు, వివిధ ప్రాంతాల ఆదర్శ రైతులు వచ్చి ఈ పొలాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పంచరత్న, బంగారు గులాబీ, కాలబట్టి, చింతలూరి సన్నాలు, గోదావరి ఉసికెలు వంటి వంగడాలతో సాగు చేశారు. జీ-20 ఇండియా ఆకారం, ఈశాన్య దిక్కున ఓం ఆకారం, ఆగ్నేయ దిక్కున శివాలయానికి చిన్నికృష్ణుడు నమస్కారం చేస్తున్నట్టు వరి పంట పండించారు.
– నిజామాబాద్ రూరల్