ఆత్మకూరు, జనవరి 31: పోలీస్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 17 రోజులపాటు చికిత్స పొంది బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో చోటుచేసుకున్నది.
ఎస్సై ప్రసాద్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీకాంత్ (29) గతేడాది హైదరాబాద్లోని ఎస్సార్ నగర్లో కానిస్టేబుల్ కోచింగ్ తీసుకొని పరీక్షలు రాశాడు. అక్టోబర్ 2023లో ఫలితాల్లో ఎంపిక కాలేదు. ఉద్యోగానికి వయోపరిమితి దాటిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. జనవరి 14న పురుగుల మందు తాగాడు. శ్రీకాంత్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందా డు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.