హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలని కోరుతూ కేసీఆర్ సర్కా రు గత జూలైలో చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
ఈ చర్యను సవాల్ చేస్తూ వీరిద్దరు పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించి తీరాలని తెలిపారు. ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించటం ఏకపక్షమని, చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్కు విచక్షణాధికారం లేదని పేర్కొన్నారు. అయితే, గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయటం వీలుకాదంటూ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.