హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఈసీఐఎల్ యాజమాన్యానికి ఉద్యోగుల సంఘానికి మధ్య జరిగిన ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకా రం 2007 నుంచి పింఛన్తోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఈసీఐఎల్ మాజీ ఉద్యోగుల వినతిని తోసిపుచ్చింది. 2009లో కుదిరిన ఒప్పం దం ప్రకారం 2007లో రిటైరైన ఎగ్జిక్యూటివ్లకు పింఛన్ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ మాజీ ఉద్యోగి సీహెచ్ నాగేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ పీ మాధవీదేవి కొట్టి వేస్తూ తీర్పునిచ్చారు. ఒప్పందం అమలుకు చట్టబద్ధత లేనందున ఈ వ్యవహారంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించలేదని తేల్చి చెప్పారు. ఈసీఐఎల్ లాభాల్లో ఉన్నందున ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా పింఛన్ ఇవ్వాలని పిటిషనర్ వాదించగా, రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు వైద్య సౌకర్యాల కల్పన ఉందని, పిటిషనర్ల వాదనను ఆమోదిస్తే సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఈసీఐఎల్ వాదించింది.