హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ ఏడాది రంజాన్ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని మైనార్టీ వర్గాల ప్రతినిధి, సమాచార హక్కు కార్యకర్త కరీం అన్సారీ వెల్లడించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మైనార్టీ శాఖ నుంచి నిధులేమైనా కేటాయించారా? అని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడంతో ఎలాంటి నిధులు కేటాయించలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. దీంతో రాష్ట్రంలోని ఇతర మతాలకు చెందిన కార్యక్రమాలకు కూడా ఇదే పద్ధతిని పాటించాలని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రభుత్వానికి సూచించారు. ఆ ట్వీట్కు సీఎం రేవంత్రెడ్డిని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని ట్యాగ్ చేశారు.