ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది.
ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ చెన్నై బౌలర్లను ఉతికారేస్తున్నారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి ఓపెనింగ్ జోడీ ఎదురుదాడికి దిగుతూ చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే షా కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతనికిది ఏడోది కావడం విశేషం. మరో ఓపెనర్ ధావన్ కూడా కెరీర్లో 42వ హాఫ్సెంచరీ సాధించాడు. ఓపెనర్లిదర్దూ ఇప్పటికే 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11 ఓవర్లకు ఢిల్లీ వికెట్ కోల్పోకుండా 113 పరుగులు చేసింది. ధావన్(56), షా(57) క్రీజులో ఉన్నారు.