హైదరాబాద్ : రాష్ట్ర అప్పుల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన లేఖను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాశారు. నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,000 కోట్ల అప్పు చేసిందని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించాను. కానీ, మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 1,77,058 కోట్ల అప్పు చేసిందని అన్నారు.
మార్చి నెలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3,47,294 కోట్ల అప్పు చేసింది అన్నాడు.
మీ లాగా మేము పూటకో మాట మార్చం. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా చేసిన అప్పు దాదాపు రూ.4,50,000 కోట్లు ఇప్పటికైనా అప్పుల గురించి తప్పుడు ప్రచారాలు మానేయండి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో, ఆర్బీఐ విడుదల చేసిన లెక్కలు, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అన్ని పంపిస్తున్నాను, అవన్నీ చూసి వాస్తవాలు తెలుసుకోండి అని లేఖలో పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావుకు హరీష్ రావు లేఖ
నేను అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల గురించి చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4,17,000 కోట్ల అప్పు చేసిందని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించాను
కానీ మీరు రాసిన లేఖలో… https://t.co/jUMm41sVO6 pic.twitter.com/5LaElK36hD
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2026