జనగామ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) నేడు జనగామ(Janagama) జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటలను(Dried crops) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి దయాకర్ రావుతో కలిసి పర్యటిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశం పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఒక ప్రకటనలో తెలిపారు.