హైదరాబాద్ : సచివాలయంలో(Secretariat) సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న వాస్తు మార్పులపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)స్పందించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికమైన కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చని నాడు రేవంత్ రెడ్డి గాయ్ గాయ్ గత్తర గత్తర చేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్కు పూటకో మార్పు చేస్తున్నాడని ఎద్దేవా చేశాడు. వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు చేయటానికి రూ.4 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇది కదా అసలు సిసలైన కాంగ్రెస్ మార్కు మార్పు అని ఎక్స్ వేదికగా స్పందించారు. ఇకనైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు జరిగే పనులు చేపట్టాలని హితవు పలికారు.
గ్రీన్ టెక్నాలజీ తో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికమైన కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చని.. గాయ్ గాయ్ గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి.ఇప్పుడు ముఖ్యమంత్రి గా సెక్రటేరియట్ కు పూటకో మార్పు చేస్తున్నాడు.
వాస్తు దోషం ఉందని ఒక్క గేట్ మార్పు చేయటానికి 4 కోట్లు… pic.twitter.com/nHKRrbSdcM
— Harish Rao Thanneeru (@BRSHarish) November 7, 2024