MBBS seats | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): డాక్టర్ కావాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం, ఆర్టికల్ 371 డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్కు సవరణ చేసినట్టు పేర్కొన్నది. గతంలో కన్వీనర్ కోటాలో స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ క్యాటగిరీ. ఇందులో తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీలలో 15 శాతం ఆలిండియా కోటా యథాతథంగా ఉండనున్నది. ఇందులో తెలంగాణ, ఏపీతోపాటు దేశంలో ఎకడి విద్యార్థులైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.
తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతోపాటు రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ఈ సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో అన్ రిజర్వుడు కోటాగా 15 శాతం అంటే.. 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీవారు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 56కు పెరిగింది. అంటే స్వరాష్ట్రంలో 36 కొత్త కాలేజీలు వచ్చాయి. సీట్ల సంఖ్య 8,340కు పెరిగింది. పాత విధానమే కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15 శాతం అన్ రిజర్వుడ్ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తున్నది. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడ్ కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభించనున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బీ క్యాటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు లభించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో కలిపి ఏటా తెలంగాణ విద్యార్థులకు మొత్తం 1,820 సీట్లు దకనున్నాయి. అంటే సుమారు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. కాలేజీలు పెరిగిన కొద్దీ ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనున్నది.
తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. ఏండ్ల నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిర్ణయాలు.. ఎంబీబీఎస్ చదువును దగ్గర చేస్తున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం అదనంగా 1,820 మెడికల్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు వచ్చేలా చేసింది. దీనిని సద్వినియోగం చేసుకొంటూ డాక్టర్ కావాలనే కలను విద్యార్థులు సాకారం చేసుకోవాలి. స్వరాష్ట్రంలో వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎకువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దకేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. 2023-24లో దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్ సీట్లలో తెలంగాణలో అందుబాటులోకి వచ్చినవి 43 శాతం. దేశవ్యాప్తంగా 2,118 ఎంబీబీఎస్ సీట్లు రాగా, ఇందులో 900 సీట్లు రాష్ట్రంలో ఉన్నాయి.
– హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఏండ్లనాటి కల సాకారమైన ఆనందం వారిది. ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకునే గూడెం మనసులు వాళ్లవి. దశాబ్దాల పోరు నుంచి ఊరటనిస్తూ పోడుకు పట్టాలిచ్చిన నాయకుడిపై అభిమానం వారిది. అందుకే కేసీఆర్కు కృతజ్ఞత చెప్తూ.. గులాబీ జెండాను గుండెలో పెట్టుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలోని 73 గిరిజన కుటుంబాలు ఇప్పుడు అంతులేని సంతోషంతో ఉన్నాయి. 30 ఏండ్లుగా 250 ఎకరాల పోడు భూమిని 73 కుటుంబాలు సాగు చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పోడు సాగుదారులందరికీ ప్రభుత్వం ఆ భూములపై పట్టాలిస్తున్నది. యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేస్తున్నది. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా 73 కుటుంబాలు బుధవారం పట్టాలు అందుకోనున్నాయి. అందుకే అనంతారంలో పండుగ వాతావరణం నెలకొన్నది. 73 కుటుంబాలు తమ గుడిసెల వద్ద ఇలా బీఆర్ఎస్ జెండాలను ఎగురవేసి తమ అభిమానం చాటుకున్నారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోట సీట్లను 100 శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు జారీచేయడంపై వైద్య విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డీ రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్, ముఖ్య సలహాదారులు రాయల సతీశ్బాబు, కృష్ణారెడ్డి, శ్రీనివాస్.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.