మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో పార్టీ కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి హరీశ్రావు. ‘మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గత నెల రోజులగా స్థానికంగా ఉంటూ, కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ సుపరిపాలనను, బీజేపీ కుట్రలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఇన్ఛార్జిలు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ’. అని రాసుకొచ్చారాయన.
మునుగోడులో ప్రధానంగా పోటీ మూడు పార్టీల మధ్యనే ఉండనుంది. టీఆర్ఎస్ అభ్యర్తిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఎన్నికల బరిలో దిగారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా, గత నెల రోజులుగా స్థానికంగా ఉంటూ, సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ సుపరిపాలనను, బీజేపీ కుట్రలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఇంచార్జ్ లు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
జై తెలంగాణ!!
— Harish Rao Thanneeru (@trsharish) November 3, 2022