సిద్దిపేట : దివ్యాంగుల(Disabled)కు అన్ని విధాల అండగా ఉన్న నాయకుడు, మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కేసీఆర్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలో కేంద్రంలో లయన్స్, అలాయన్స్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు రూ. నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు.
దేశంలోనే దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆరు వేలు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలని దివ్యాంగుల పక్షాన డిమాండ్ చేశారు. దివ్యాంగ వికలాంగులకు అభయ జ్యోతి అందించే సేవలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. కొంతమంది మానసిక దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అలాంటి వారు నా దృష్టి లో మనుషులు కాదన్నారు.
మానసిక దివ్యాంగుల అవసరాల కోసం నాజీతం నుంచి కొంత ఆర్థిక సాయం చేస్తానన్నారు. కంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా సిద్దిపేటలోనే ఎల్వీ ప్రసాద్ దవాఖానను ఏర్పాటు చేశామని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభయ జ్యోతి శాశ్వత భవన నిర్మాణానకి తన వంతు సహకారం అదజేస్తానని హామీనిచ్చారు.