Harish Rao | కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వందరోజుల కాంగ్రెస్ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇస్తానన్న మొదట హామీ అయిన ప్రతి నెల రూ. 2,500 డిసెంబర్ నెల నుంచి ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. కొత్త హామీలు అమలుకాకపోగా.. ఉన్న పథకాలు కూడా అటకెక్కించిన ఘనత పార్టీది. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కరువు వచ్చింది. కరెంట్ మోటార్లు కాలిపోతున్నయి’ అన్నారు.
‘వందరోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఓటు వేస్తే మోసపోతాం. రూ.2లక్షల రుణమాఫీ, రూ.4వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదు. యాసంగి వడ్లకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో ప్రశ్నించాలి. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి. రూ.2లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కు ఓటు వేయండి. కానివాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయండి. వందరోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్కు మళ్లీ ఓటేసి మోసపోవద్దు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన నాయకులకు మీరు ఈ రోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పిలుపునిచ్చారు.
‘నిరుద్యోగులను, రైతులను మోసం చేసిన పార్టీ బీజేపీ. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి? ఏం ఇచ్చిందని బీజేపీ పార్టీకి ఓటు వేయాలి? రాముడి అక్షింతల పేరుతో రాజకీయం చేయడం తప్పా.. తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. సోషల్ మీడియాలో లీకు న్యూస్లు, ఫేకు వార్తలతో గోబెల్స్ ప్రచారం చేయిస్తూ రాజకీయ పబ్బం గడుపుతుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి కారు గుర్తుపై గెలిచి ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి వెంటనే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని, స్పీకర్పై చర్యలు తీసుకొని, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తరు కావచ్చు. కానీ, వారి ఆత్మ గౌరవాన్ని కొనలేరు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. గాంధేయవాదంతో రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, మన అధినేత కేసీఆర్. అదే పోరాట స్ఫూర్తితో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.