హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని, భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇటీవల ఇద్దరు బాలికలపై జరిగిన లైంగికదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత లేదని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని, అందుకే నిత్యం రాష్ట్రంలో ఎకడో ఒకచోట లైంగికదాడి ఘటనలు జరుగుతూనేఉన్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో 2000కు పైగా లైంగికదాడి ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. హోంశాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షణలో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, షీ టీమ్స్, సఖీ, భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యమని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యంలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతిభద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. బాలికలపై లైంగికదాడిన పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు.